న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. లగ్జరీ లుకింగ్, సౌకర్యవంతంగా ఉండటంతో ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు కస్టమర్లు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. ఎనిమిదేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటాను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంటే ఐదు నిమిషాలకొక క్రెటాను విక్రయించినట్లు అయింది.
ఇటీవల సంస్థ అప్డేటేడె వెర్షన్ క్రెటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారుకోసం కూడా కస్టమర్లు క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఏకంగా 60 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి. రూ.11 లక్షల ప్రారంభ ధరతో ఏడు రకాల్లో ఈ మాడల్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ.
కొత్త క్రెటా కారు కావాలంటే గరిష్ఠంగా ఏడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలాగే క్రెటాను ఇప్పటి వరకు 2.80 లక్షల యూనిట్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో-ఎన్, టయోటా అర్బన్ క్రూజర్, స్కోడా కుష్క్యూ, ఫోక్స్వ్యాగన్ టైగూన్ల నుంచి క్రెటా తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది.