న్యూఢిల్లీ, ఆగస్టు 10: సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. నాలుగు రకాల్లో లభించనున్న ఈమోడల్ రూ.27.69 లక్షల ప్రారంభ ధరలో లభించనున్నది.
రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.27,69,700 నుంచి రూ.30,17,000 లోపు లభించనుండగా, అదే 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.30,19,700 నుంచి రూ.34,39,000 లోపు నిర్ణయించింది.