న్యూఢిల్లీ, మార్చి 21: హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్కు సరికొత్త మధ్యస్థాయి సెడాన్ ‘వెర్నా’ను పరిచయం చేసింది. 1.5 లీటర్ల ఇంజిన్ కలిగిన ఆరో జనరేషన్ వెర్నా రూ.10.89 లక్షల నుంచి రూ.16.19 లక్షల మధ్యలో లభించనున్నది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ రకం రూ.14.83 లక్షల నుంచి రూ.17.37 లక్షల మధ్యలో నిర్ణయించింది. ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి లీటర్కు 18.6 నుంచి 20.6 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నదని కంపెనీ ఇండియా ఎండీ, సీఈవో అన్సూ కిమ్ తెలిపారు. 2006లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన వెర్నాహోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్వ్యాగన్ విర్టస్, మారుతి సియాజ్లకు పోటీగా సంస్థ ఈ మాడల్ను పరిచయం చేసింది.