న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ స్టైలింగ్, కలిగిన ఈ కారును నూతనంగా తీర్చిదిద్దింది. 1 లీటర్ పెట్రోల్ టర్బో జీడీఐ ఇంజిన్ కలిగిన ఈ కారులో ఆరు-స్పీడ్ ఐఎంటీ(ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్), సెవెన్-స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆఫ్షన్ను ఎంచుకునే వీలు కల్పించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులోనూ ఈ విభాగంలో మరిన్ని మోడళ్ళను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో కిమ్ తెలిపారు. 120 పీఎస్ శక్తినివ్వనున్న ఈ కారు కేవలం 10 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.