హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్.. మరో ఘనత సాధించింది. విక్రమ్-1 ఆర్బిటల్ లాంచ్ వెహికిల్కు సంబంధించి తొలి దశ కింద చేపట్టిన కీలకమైన ప్రూఫ్ ప్రెషర్ టెస్ట్ (పీపీటీ) విజయవంతమైందని సోమవారం స్కైరూట్ తెలిపింది. కాగా, టీ-హబ్ కేంద్రంగా ప్రారంభమై అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థగా స్కైరూట్ పలు ప్రయోగాలను ఇప్పటికే విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇక మొదటి దశకు ‘కలాం-1200’ పేరు పెట్టామని, తాజాగా జరిపిన పరీక్షలో గరిష్ఠంగా ఊహించిన ఒత్తిడిని విక్రమ్-1 అధిగమించిందని స్కైరూట్ బృందం తెలిపింది. పీపీటీ విజయవంతం కావడం.. కేవలం మా సంస్థకేగాక, యావత్తు భారతీయ అంతరిక్ష నౌక సామర్థ్యాలకే గర్వకారణమని ఈ సందర్భంగా స్కైరూట్ అభివర్ణించింది. లో ఎర్త్ ఆర్బిట్లోకి దాదాపు 300 కిలోల పేలోడ్స్ను తీసుకెళ్లడానికి వీలుగా ఈ విక్రమ్-1ను రూపొందించారు.