మెదక్ మున్సిపాలిటీ, మార్చి 17: కాలు ష్య నియంత్ర చర్యలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు జడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా 1, 2, 4, 7వ స్థాయీ సంఘం శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. చిన్నశంకరంపేట, చేగుంట మండలాల్లోని పరిశ్రమల నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారని మాధవి, శ్రీనివాస్ సమావేశం దృష్టి తీసుకురాగా, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ కాలుష్య నియంత్రణ అధికారి సిద్దార్థ్ను ఆదేశించారు. మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి వద్ద పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగతో రోడ్లు కనిపించడం లేదన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టని పరిశ్రమల చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ అధికారి సిద్దార్థ్ తెలిపారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తూ కార్మికుల వేతనాలు ఆలస్యం కాకుం డా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ డీపీవో తరుణ్కు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు బాగా లేదని, ప్రభు త్వం వైద్య రంగానికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నదని జడ్పీటీసీలు విజయ్కుమార్, బాబ్య అన్నారు. ఏ చిన్న సమస్యకైనా వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారని, సిబ్బంది పనితీరులో మార్పు తీసుకురావాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లకు సూచించారు. జిల్లా అడ్వయిజరీ కమిటీని తొందరగా ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరంలో జిల్లాలోని 6054 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 237.94 కోట్ల రుణాలు అందజేసి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం నిలిపినట్లు తెలిపారు. 2020-21 సంవత్సరంలో కరోనా నేపథ్యంలో 8431 సంఘాలకు 284.01 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. జిల్లాలో చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి పేర్కొన్నారు. 2020-21 సంవత్సరానికి గానూ 8.60 కోట్ల పెట్టుబడితో 211 మందికి ఉపాధి కల్పించగా, పరిశ్రమల శాఖ నుంచి రూ.2.68 కోట్ల రాయి తీ మంజూరు చేసినట్లు చెప్పారు. మనోహర్బాద్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీలత సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందడంతో ఉత్తర్వులను చైర్ పర్సన్ అందజేశారు. సమా వేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, జడ్పీ సూపరింటెండెంట్ జెమ్లానాయక్, జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, డీపీవో తరుణ్, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, ఉపాధికల్పన అధికారి విజయ్కుమార్, మైనింగ్ ఏడీ జయరాజ్, జడ్పీటీసీ సుజాతతో పాటు ఆయా శాఖాలధికారులు పాల్గొన్నారు.