హైదరాబాద్, జనవరి 11: హైదరాబాద్కు చెందిన ఆర్గానిక్ ఫుడ్ సంస్థ శ్రేష్టా నేచురల్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి సంస్థ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ. 500 కోట్ల వరకు నిధులు సేకరించాలనుకుంటున్నది. ఈ ఐపీవోల్లో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో రూ.50 కోట్ల వరకు నిధులను సేకరించనున్న సంస్థ..మిగతా 70,30,962 ఈక్విటీ షేర్లను ఆఫర్-ఫర్-సేల్ రూట్లో విక్రయించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఈ శ్రేష్టా నేచురల్ బయోప్రొడక్ట్స్..ప్యాకేజ్డ్ ఆర్గానిక్ ఫుడ్ సెగ్మెంట్కు చెందిన ‘24 మంత్రా’కి చెందినదే కావడం విశేషం.