హైదరాబాద్, ఫిబ్రవరి 26: హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పరికరాల తయారీ సంస్థ రఘు వంశీ మెషిన్ టూల్స్ లిమిటెడ్..మైక్రో టర్బోజెట్ ఇంజిన్ విడుదల చేసింది. ‘ఇంద్ర ఆర్వీ25: 240ఎన్’ పేరుతో రూపొందించిన ఈ టర్బోజెట్ ఇంజిన్ను ఐఐటీ-హైదరాబాద్ మద్దతుతో రూపొందించింది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయంగా తయారైన మైక్రో టర్బోజెట్ ఇంజిన్ ఇదేనని డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీష్ రెడ్డి తెలిపారు.
దేశీయ ఏరోస్పేస్ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని కంపెనీ ఎండీ వంశీ వికాస్ తెలిపారు. ఏరోస్పేస్ పరిశోధన రంగ ప్రపంచ హబ్గా భారత్ నిలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 100 కిలోల బరువుతో తయారైన ఈ మైక్రో టర్బో జెట్ ఇంజిన్ను యూఈవీఎస్, క్షిపణులు, సహాయక యూనిట్లలో వాడనున్నారు.