హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీ మారుట్ డ్రోన్స్… జపాన్కు చెందిన స్ర్కైడ్రైవ్తో జట్టుకట్టింది. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో స్ర్కైడ్రైవ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా
వివిధ రకాల డ్రోన్లను రూపొందించి వ్యవసాయ రంగంతో పాటు ఇతర కార్యకలాపాలకు డ్రోన్లను తయారు చేసి అందిస్తున్నామని, తాజాగా స్కైడ్రైవ్తో కుదిరిన ఒప్పందంతో ఎయిర్ ట్యాక్సీలను రూపొందించి దేశ వ్యాప్తంగా వాడుకలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు ప్రేమ్ తెలిపారు.