న్యూఢిల్లీ, మే 18: పలు అంతర్జాతీయ తుఫానులు కలసి చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వ్బ్యాంక్ హఠాత్తుగా రేట్లను పెంచినట్టు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ వెల్లడిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆర్బీఐ పాలసీ మీట్ జూన్లో జరగాల్సి ఉండగా, మే 2-4 తేదీల్లో మధ్యంతరంగా సమావేశమైన ఎంపీసీ సభ్యుల అభిప్రాయాల్ని తెలిపే మినిట్స్ను బుధవారం ఆర్బీఐ విడుదల చేసింది. ఈ సమీక్ష అనంతరం రెపో రేటును 0.4 శాతం (40 బేసిస్ పాయింట్లు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ మినిట్స్ వివరాలివి…