Gold Rates | బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. మహిళలైతే ప్రతి పండగ, ప్రతి కుటుంబ వేడుక సందర్భంగా బంగారం, బంగారం ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. దేశీయ అవసరాలకు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే బంగారం ధర చాలా ఎక్కువ. బంగారం కొనుగోళ్లపై ఖచ్చితమైన రిటర్న్స్ లభిస్తాయి కనుక ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కానీ, బంగారం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమేనా.. అంటే కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజుల్లో బంగారం, వెండి ధరలు పైపైకి దూసుకెళ్లాయి. పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర గత నాలుగు రోజుల్లోనే రూ.1550 పెరిగింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గడం, అమెరికా ఫెడ్ రిజర్వు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నదన్న వార్తలతో బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా మారింది. ఫలితంగా జాతీయంగా, అంతర్జాతీయంగా బంగారం పిరమవుతున్నది.
బంగారం దారిలోనే వెండి కూడా ప్రయాణిస్తున్నది. హైదరాబాద్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.290 పెరిగి రూ.52,450 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల పుత్తడి ధర రూ.330 పెరిగి రూ.57,220 మార్క్ను దాటింది. దేశ రాజధానిలో 22 క్యారట్ల బంగారం తులం రూ.52,600 పలికితే, 24 క్యారట్ల బంగారం రూ.57,370లకు చేరుకున్నది.
వెండి ధర రోజురోజుకు పెరిగిపోతున్నది. హైదరాబాద్లో గత నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.200 పెరిగింది. మంగళవారం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.69,500 పలికింది. దేశ రాజధాని హస్తినలో రూ.66వేల వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్పై 1912 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. కొన్ని రోజుల క్రితం ఇది 1800 డాలర్ల వద్ద నిలిచింది. అలాగే స్పాట్ వెండి ఔన్స్ ధర 21.80 డాలర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.393 వద్ధ స్థిర పడింది.