న్యూఢిల్లీ, జూన్ 6: కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకు శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు ఏకంగా తమ మాడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించాయి. ఈ ఆఫర్లు ప్రస్తుత నెలకు మాత్రమే వర్తించనున్నాయని, వీటిని నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్, లాయల్టీ రివార్డ్, కార్పొరేట్ ప్రయోజనాలు కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపాయి.
హ్యుందాయ్..
హ్యుందాయ్ మోటర్స్ ఎంపిక చేసిన మాడళ్లపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది. క్రెటా ఎస్యూవీని కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ..వెర్నాపై రూ.95 వేలు, అప్డేటెడ్ మాడల్పై రూ.55 వేలు, క్రెటా ఎలక్ట్రిక్ మాడల్పై రూ.85 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని ఆటోకార్ ఇండియా తాజాగా వెల్లడించింది. వీటితోపాటు గ్రాండ్ ఐ10 నియోస్పై రూ.78 వేలు, అల్కాజర్పై రూ.75 వేలు, ఐ20, ఐ20 ఎన్ లైన్ మాడల్పై రూ.63 వేలు, ఎక్సటర్పై రూ.43 వేల డిస్కౌంట్, ఔరా మాడల్పై రూ.25 వేలు, వెన్యూపై రూ.5 ప్రయోజనాలు కల్పిస్తున్నది.
టాటా మోటర్స్…
పలు ప్యాసింజర్ వాహనాలపై రూ.55 వేల వరకు రాయితీ ఇస్తున్నట్టు టాటా మోటర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు 2026లో విడుదలైన ఎస్యూవీలు, పంచ్, టియాగో మాడళ్లు ఉన్నాయి. వీటిలో నెక్సాన్ఫై రూ.55 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న సంస్థ..కర్వ్పై రూ.55 వేలు, హారియర్, సఫారీ ఎస్యూవీపై రూ.45 వేల వరకు, అల్ట్రోజ్ రూ.40 వేల వరకు, టియాగోపై రూ.35 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది.
మారుతి కార్లపై
మారుతి సుజుకీ కూడా రాయితీలను ప్రకటించింది. ఇన్విక్టో ఎంపీవీ పై రూ.2.15 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతోపాటు గ్రాండ్ విటారాపై రూ.1.35 లక్షల వరకు, ఇగ్నిస్పై రూ.45 వేలు, బాలెనోపై రూ.40 వేలు, ఎక్స్ఎల్ఆర్పై రూ.45 వేలు, జిమ్నీపై రూ.45 వేలు, ఫ్రాంక్స్పై రూ.25 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. వీటిలో ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తున్నది.