న్యూఢిల్లీ : ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ను హెచ్ఎస్బీసీ ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్టు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సోమవారం వెల్లడించింది. రజనీష్ కుమార్కు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజంలో 40 ఏండ్లపాటు సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉంది.
రజనీష్ గత ఏడాది అక్టోబర్లో ఎస్బీఐ చైర్మన్గా పదవీవిరమణ పొందారు. ఎస్బీఐ చీఫ్గా పనిచేసిన సమయంలో ఆయన ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ వేదికలను బలోపేతం చేశారని హెచ్ఎస్బీసీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత ఆర్ధిక సేవల పరిశ్రమలో రజనీష్కు ఉన్న విస్తార అనుభవం తమకు ఉపకరిస్తుందని హెచ్ఎస్బీసీ బోర్డు చైర్మన్ పీటర్ వాంగ్ పేర్కొన్నారు.