హైదరాబాద్, ఏప్రిల్ 13: కృత్రిమ మేధస్సుతో అనుసంధానమైన ల్యాప్టాప్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది హెచ్పీ. ఇంటెల్-కోర్-అల్ట్రా ప్రాసెసర్ కలిగిన ఒమెనన్ ట్రాన్సెండ్ 14 కలిగిన ఈ గేమింగ్ ల్యాప్టాప్ పాతవాటితో పోలిస్తే 65 శాతం అధికంగా బ్యాటరీ లైఫ్ ఇవ్వనున్నది.
అలాగే ఏఐ ఫీచర్స్ కలిగిన ఎన్వీ ఎక్స్360 14 అంగుళాల కలిగిన ఈ ల్యాప్టాప్ 1.637 కిలోల బరువు కలిగివున్నది. బ్యాటరీ లైఫ్ 11.5 గంటలు రానున్నది. రెండు కలర్స్లో లభించనున్న హెచ్పీ ఒమెన్ ట్రాన్సెండ్ ధర రూ.1,74,999గాను, మరో మాడల్ ధరను రూ. 99,999గా నిర్ణయించింది.