హైదరాబాద్, జూలై 12: హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవల సంస్థ పీగో మరోసారి నిధులను సమీకరించబోతున్నది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంస్థ..త్వరలో మరో 2 మిలియన్ డాలర్లు(రూ.16 కోట్లకు పైమాటే) నిధులను సేకరించనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో హరి కృష్ణ తెలిపారు.
ఈ నిధులతో ప్రస్తుతం నాలుగు నగరాల్లో హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవలు అందిస్తుండగా, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే త్వరలో క్లౌడ్ సెఫ్టీ సేవలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, సంస్థ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్, రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్తో జట్టు కట్టింది.