న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రముఖ ఈవీ బైకుల తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్కు మరో రెండు మోడళ్ళను పరిచయం చేసింది. వీటిలో రూ.1.25 లక్షల ధర కలిగిన ఆక్సో మోడల్ ఒకటికాగా, రూ.1.40 లక్షల విలువైన ఆక్సో-ఎక్స్ మోడల్ మరొకటి. 3.75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్తో తయారైన ఈ బైకు ఒక్కసారి చార్జింగ్తో 150 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు రీచార్జి అవనున్నదని కంపెనీ ఫౌండర్ కేతన్ మెహతా తెలిపారు.