న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ మార్కెట్లోకి నయా యాక్టివా స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన ఈ స్కూటర్లో సౌలభ్యంగా కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.80,950గా నిర్ణయించింది. బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2 ఇంచుల టీఎఫ్టీ డిస్ప్లే, నావిగేషన్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ ఆరు రంగుల్లో లభించనున్నది. 109.51 సీసీ ఇంజిన్తో తయారు చేసింది.