HMD Global : భారత్లో నోకియా ఫోన్లను తయారుచేస్తున్న హెచ్ఎండీ సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయనుంది. ఈ ఏడాది న్యూ స్మార్ట్ఫోన్ను దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా హెచ్ఎండీ సన్నాహాలు చేపట్టింది. సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్పై హెచ్ఎండీ ఫోకస్ పెట్టిన క్రమంలో భారత్ మార్కెట్లో నోకియా పరిస్ధితి ఏంటనే వార్తలు తలెత్తుతున్నాయి.
హెచ్ఎండీ స్మార్ట్ఫోన్లు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 వేదికగా లాంఛ్ చేసేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోంది. తమ సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసినా నోకియాతో తమ అనుబంధం కొనసాగుతుందని హెచ్ఎండీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవి కన్వర్ స్పష్టం చేశారు.
భారత్లో నోకియా ఫోన్ల ఉత్పత్తిని తాము కొనసాగిస్తామని, విలువలతో కూడిన అత్యధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన డివైజ్లను అందించే దిశగా కసరత్తు సాగిస్తామని అన్నారు. అన్ని నోకియా బ్రాండ్ డివైజ్ల వారెంటీ ముగిసే వరకూ తమ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు. భారత్ మార్కెట్లో నోకియా ఫోన్ల ఉనికి కొనసాగుతుందని, దేశంలో తయారీ కొనసాగించడంతో పాటు హెచ్ఎండీ నుంచి నూతన శ్రేణి డివైజ్లను ప్రవేశపెడతామని రవి కన్వర్ వెల్లడించారు.
Read More :
Vivo V30 | గ్లోబల్ మార్కెట్లలోకి వివో వీ30 ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!