న్యూఢిల్లీ, మే 17: హిందుజా గ్రూపు చైర్మన్ శ్రీచంద్ పరమానంద్ హిందుజా కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏండ్లు. హిందుజా బ్రదర్స్లో పెద్దవాడైన ఎస్పీ హిందుజా లండన్లో మృతి చెందారు. ఎస్పీ హిందుజా మృతిపట్ట కుటుంబ సభ్యులు ప్రగాడ సంతాపం వ్యక్తంచేశారు. వ్యాపార రంగంలో చెరగనిముద్ర వేసిన ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి స్వీడన్కు చెందిన గన్ల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్కు అతిపెద్ద కాంట్రాక్టును పొందడంలో సహాయపడినందుకుగాను ఆయనకు ప్రతిఫలంగా ఎస్ఈకే 81 మిలియన్ లబ్దిపొందారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఎస్పీ హిందుజాను బహిష్కరించింది.