TATA-Air India | ఎయిరిండియాను రూ.18 వేల కోట్ల బిడ్తో టేకోవర్ చేసుకుంటున్న టాటా సన్స్ మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నదా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఏవియేషన్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగిడేందుకు టాటా సన్స్ ఖర్చు చేస్తున్న రూ.18వేల కోట్లు ప్రారంభమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే డిజిటల్, హైటెక్ మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్ రంగాల్లోకి అడుగిడిన టాటా సన్స్.. ఏవియేషన్లో ఎయిరిండియా నిలదొక్కుకోవాలంటే మరిన్ని నిధులు సమకూర్చాల్సిందే.
ఏవియేషన్ రంగం అంటేనే క్యాపిటల్ గజ్లింగ్, మనీ లూజింగ్ వెంచర్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. 14 ఏండ్లుగా ఎయిరిండియా నష్టాలే చవి చూస్తున్న నేపథ్యంలో పుట్టింటికి చేరుకుంటున్న మహారాజాతో టాటా సన్స్కు సానుకూలం కాదనే మాట కూడా వినిపిస్తున్నది. కరోనాకు ముందు పరిస్థితుల్లోకి రావాలంటే మరో నాలుగేండ్లు వేచి చూడాల్సి రావచ్చు.. అంటే మరో నాలుగేండ్లకు విదేశీ ప్రయాణికుల ట్రాఫిక్.. కరోనా ముందు నాటి పరిస్థితులకు చేరుతుందని అంచనా . అప్పటి వరకు ఎయిరిండియాలో లాభాలు చూడటం కష్టమేనని సమాచారం.
ఇప్పటికే ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా సంస్థల్లో టాటా సన్స్ను రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పటి వరకు వాటి వల్ల నష్టాలు రూ.9000 కోట్ల పై చిలుకే అని తెలుస్తోంది. అధిక ఆపరేషన్స్ వ్యయం, ఎయిర్ ఏషియా ఇండియాలో ముడుపుల కుంభకోణాలు వెలుగు చూశాయి. అయితే, పూర్తిగా ఎయిరిండియాను పునర్వ్యస్థీకరించాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. భూషణ్ స్టీల్ తర్వాత చంద్రశేఖరన్ హయాంలో టాటా సన్స్ టేకోవర్ చేస్తున్న రెండో సంస్థ ఎయిరిండియా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు
Offline Digital Payments | త్వరలో ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్
US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్