హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కాంపిటేషన్ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సీసీఐ (కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విచారణ వ్యవహారంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి హైకోర్టులో చుకెదురైంది. సీసీఐ విచారణను సవాలు చేస్తూ రెడ్డీస్ ల్యాబ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. విచారణ మాత్రమే కొనసాగుతున్నదని, తుది నిర్ణయం వెలువడలేదని అందువల్ల ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఇండియన్ డ్రగ్ మ్యాన్ప్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఎ)లోని సంస్థలు రెడ్డీస్ ల్యాబొరేటరీతోపాటు కాంపిటేషన్ చట్టంలోని సెక్షన్ 3, 4లను ఉల్లంఘిస్తున్నాయంటూ ఆలిండియా కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ 2012లో సీసీఐకి ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ జనరల్ 2024లో సమర్పించిన నివేదికపై అభ్యంతరాలు, వివరణలుతో సహా ఆడిట్ నివేదికలను సమర్పించాలంటూ సీసీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ రెడ్డీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.