Hero Motocorp | హైదరాబాద్, మార్చి 1: ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదా వీ1 ప్లస్ పేరుతో విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.15 లక్షలుగా నిర్ణయించింది. 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటర్ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్తో 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఫేమ్ 2 సబ్సిడీ, పోర్టబుల్ చార్జర్ కలుపుకొని సంస్థ ఈ ధరను నిర్ణయించింది.
విదా వీ1 ప్రొ, వీ1 ప్లస్ మాడళ్ల కంటే ఇది రూ.30 వేలు తక్కువ ధరకు లభించనున్నది. కేవలం 3.4 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది. పూర్తిస్థాయి డిజిటల్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్తో రూపొందించింది.