న్యూఢిల్లీ : స్కూటర్ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ భారత్ మార్కెట్లో హీరో ప్లెజర్+ ఎక్స్టెక్ 110 సీసీని లాంఛ్ చేసింది. ఎల్ఎక్స్ వేరియంట్ ప్రారంభ ధర రూ 61,900 (ఎక్స్షోరూం) కాగా, ప్లెజర్+ 110 ఎక్స్టెక్ ప్రారంభ ధర రూ 69,500 (ఎక్స్షోరూం)గా వెల్లడించింది.
ప్రస్తుత హీరో ప్లెజర్+ రేంజ్కు కొనసాగింపుగా హీరో ప్లెజర్+ ఎక్స్టెక్ మెరుగైన ఫీచర్లతో జుబిలియంట్ యల్లో కలర్లో అందుబాటులో ఉంటుందని హీరో మోటోకార్ప్ స్ట్రేటజీ, గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మలోలీ మాసన్ వెల్లడించారు. ప్లాటినం ఎడిషన్ స్ఫూర్తితో ఎక్స్టెక్ మోడల్ ఎలిగెంట్ ఎలిమెంట్స్తో ఆకట్టుకోనుంది. బీఎస్ 6 స్టాండర్డ్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం ఐ3ఎస్ టెక్నాలజీ వంటి ఫీచర్లు న్యూ స్కూటర్కు ఆకర్షణలుగా నిలవనున్నాయి.