న్యూఢిల్లీ, మే 4: హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ జోరు కొనసాగించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.811 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.621 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.7,628 కోట్ల నుంచి రూ.8,672 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.34,727 కోట్ల ఆదాయంపై రూ.2,800 కోట్ల నికర లాభాన్ని గడించింది.
రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.35 తుది డివిడెండ్ను సంస్థ ప్రకటించింది. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.100(5000 శాతం) డివిడెండ్ను ప్రకటించినట్టు అయింది.