(ఐపీపీబీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. గ్రామీణ, సెబీ-అర్బన్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐపీపీబీల మధ్య అధికారిక ఒప్పందం సోమవారం జరిగింది. ఐపీపీబీకి ఉన్న 4.7 కోట్ల మంది వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు అందించడానికి వీలు పడనున్నది. ఐపీపీబీకి ఉన్న వినియోగదారుల్లో 90 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. ఐపీపీబీకి ఉన్న 2 లక్షల మంది పోస్ట్మెన్లకు మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ పరికరాలతో బ్యాంకింగ్ సేవలకు వీలున్నది.