ముంబై, జూలై 11: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలన వివాదంపై బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగ్దీశ్ స్పందించారు.
మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన ఆరోపణలను నిరూపించడానికి నిర్వహించి న స్వతంత్ర చట్టపరమైన సమీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టంచేసింది. ఈ ఏడాది ఎదుర్కొన్న అతిపెద్ద పాలన వివాదంపై బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.