హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైస్రాయ్ హోటల్ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ట్రిబ్యునల్ తీర్పు అమలును నిలిపివేస్తూ తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దివాలా పరిషార ప్రక్రియలో భాగంగా వైస్రాయ్ హోటల్ను వశం చేసుకోడానికి రూ.185 కోట్లకు ప్రణాళిక ఆమోదం పొందాక పెట్టుబడిదారుడిగా ఉన్న సింగపూర్ కంపెనీని కో-అప్లికెంట్గా అనుమతించాలని కోరుతూ సీఎఫ్ఎం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సీఎఫ్ఎం సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్ను హైకోర్టు ఇటీవల విచారించింది. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.