సిటీబ్యూరో, ఏప్రిల్ 5 ( నమస్తే తెలంగాణ ): టై ఆధ్వర్యంలో బిజినెస్ ఐడియా టోర్నమెంట్ 7వ ఎడిషన్లో ఐఐటీ హైదరాబాద్కు చెందిన హేమాక్ హెల్త్కేర్ స్టార్టప్ విజేతగా నిలిచింది. రన్నరప్గా ఢిల్లీకి చెందిన నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫీట్వింగ్స్ సంస్థ నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫైనల్ వీజేతలను జేఎన్టీయూ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ దండేబోయిన రవీందర్లు సత్కరించి బహుమతులు అందించారు. మొదటి విజేతకు రూ.75 వేలు, రన్నరప్కు రూ.50 వేలు ప్రైజ్మనీ అందించారు. కాగా, ఈ విజేతలు మే-జూన్లో జరగబోయే సిలికాన్ వ్యాలీలో గ్లోబల్ ఫైనల్స్లో టై హైదరాబాద్, తెలంగాణ రాష్ర్టానికి ప్రాతినిథ్యం వహించనున్నారు.