న్యూఢిల్లీ, జూలై 13: గత ఆర్థిక సంవత్సరం రూ.35వేల కోట్లకుపైగా జీఎస్టీ మోసాలను అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ మేరకు దాదాపు 8వేల కేసుల్ని నమోదు చేయగా, 426 మంది అరెస్టయ్యారు. ఇన్పుట్లపై నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి మోసాలకు పాల్పడ్డారని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు మంగళవారం తెలియజేసింది.
880 కోట్ల మోసం
బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూ.880 కోట్ల ఆదాయాన్ని దాచిపెట్టిందని ఐటీ శాఖ గుర్తించింది. ఈ నెల 8న సదరు సంస్థకు చెందిన ప్రాంతాల్లో సర్వే అనంతరం ఇది వెలుగుచూసింది.