న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ (రూ.1.41 లక్షల కోట్లు) తర్వాత ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. అయితే నిరుడు సెప్టెంబర్తో పోలిస్తే 23 శాతం అధికమని పేర్కొంది. ఈసారి సెంట్రల్ జీఎస్టీ రూ.20,578 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.26,767 కోట్లు, ఐజీఎస్టీ రూ.60,911 కోట్లు, సెస్ల రూపంలో మరో రూ.8,754 కోట్లు వసూలైనట్లు తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటం, పన్ను ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, మోసపూరిత బిల్లులకు చెక్ పడటం కలిసి వచ్చింది.