న్యూఢిల్లీ, నవంబర్ 1 : పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ వసూళ్లు రూ.1.48 లక్షల కోట్లు. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల రికార్డు తర్వాత అక్టోబర్ నెల వసూళ్లదే ద్వితీయస్థానమని మంగళవారం విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. వివరాలు..
అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో రూ.4,284 కోట్ల వస్తు సేవల పన్నుల వసూళ్లు జరిగాయి. నిరుడు అక్టోబర్లో నమోదైన రూ.3,854 కోట్ల కంటే 11 శాతం వృద్ధిచెందాయి. అలాగే 2022 సెప్టెంబర్లో జరిగిన రూ.3,915 కోట్లతో పోలిస్తే అక్టోబర్లో 9.40 శాతం పెరిగాయి.