GST Collection | జనవరిలో జీఎస్టీ వసూళ్లు అదరగొట్టాయి. గతేడాదితో పోలిస్తే 2022 జనవరిలో 15 శాతానికి పైగా పెరిగి 1.38 లక్షల కోట్లు దాటాయి. ఆదివారం వరకు జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ 10.5 మిలియన్ల ఫైల్ అయ్యాయి. త్రైమాసిక రిటర్న్స్ 36 లక్షలు దాఖలయ్యాయని ఆర్థికశాఖ తెలిపింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లు దాటడం ఈ ఏడాదిలో నాలుగోసారి.
ఈ నెల 31 సాయంత్రం మూడు గంటల వరకు జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు 1,38,394 కోట్లు అయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.24,674 కోట్లయితే, ఎస్జీఎస్టీ రూ.32,016 కోట్లు, ఐజీఎస్టీ 72,030 కోట్లు ఉన్నాయి. ఐజీఎస్టీలో వస్తువుల దిగుమతిపై రూ.35,181 కోట్లు ఉన్నాయి. ఇంకా వస్తువుల దిగుమతిపై రూ.517 కోట్లతోపాటు మొత్తం వివిధ రకాల సెస్ రూ.9,674 కోట్లకు చేరింది.
ఇంతకుముందు గతేడాది ఏప్రిల్లో గరిష్ఠంగా రూ.1.39 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 2020 జనవరితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 25 శాతానికి పై చిలుకే. డిసెంబర్లో 67 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయితే, నవంబర్తో పోలిస్తే 14 శాతం ఎక్కువ. గత నవంబర్లో 58 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయ్యాయి. జనవరిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనవరిలో కేంద్రం జీఎస్టీ పరిహారంగా రూ.18 వేల కోట్లు చెల్లించింది.