హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటర్స్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్నే విప్లవాత్మకంగా పరిచయం చేసింది. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్&కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ సోమవారం వెల్లడించింది. ప్రమోషనల్ ఆఫర్గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వపు ‘గో ఎలక్ట్రిక్’ ప్లాట్ఫామ్లో క్వాంటాను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసినట్లు గ్రావ్టన్ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్ పాకా తెలిపారు.