హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్..అమెరికాలో ప్యాకేజింగ్ యూనిట్ను నెలకొల్పింది. 79 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ కోసం 125 మిలియన్ డాలర్లు(రూ.101 కోట్లకు పైమాటే) పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది. కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా ఈ యూనిట్ను నెలకొల్పినట్లు, ముఖ్యంగా అక్కడి ఫార్మాస్యూటికల్స్ ప్యాకేజింగ్ కార్యకలాపాల్లోకి ప్రవేశించినట్లు అయిందని కంపెనీ ఫౌండర్, ఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ నూతన ప్యాకేజింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో ఏపీఐ నుంచి ప్యాకేజింగ్కు వర్టికల్గా అనుసంధానించబడిన కొన్ని ఔషధ కంపెనీల్లో గ్రాన్యూల్స్ కూడా ఒకటిగా నిలువనుందని, ఇది గొలుసుకట్టు పటిష్ఠతను మరింత పెంచుతుందన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పారిశ్రామికరంగంలో నూతనోత్తేజంతో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా ఔషధ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది.