న్యూఢిల్లీ, మే 29: ఆఫ్షోర్ విండ్, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీలను 25 ఏండ్లపాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2032 డిసెంబర్ 31దాకా ఈ ఆఫర్ ఉండనున్నది. దీంతో ఈలోగా మొదలయ్యే ప్రాజెక్టులకు 25 ఏండ్లపాటు చార్జీలు వర్తించబోవని, ప్రాజెక్టు ప్రారంభమైన తేదీ దగ్గర్నుంచే చార్జీల రద్దు అమల్లోకి వస్తుందని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఈ నిర్ణయం.. పెద్ద ఎత్తున దేశంలోకి విదేశీ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు రావడానికి, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల విస్తరణకు దోహదం చేయగలదని ఆ ప్రకటనలో సదరు మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, 2033 జనవరి 1 నుంచి చార్జీలు మళ్లీ మొదలవుతాయన్నది.