న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్ తన యూజర్లకు మెరుగైన సేవలందించాలని నిర్ణయించింది. గూగుల్ ఖాతా ఉన్న యూజర్లందరికీ.. గూగుల్ వర్క్ స్పేస్ సేవలు ఉచితంగా అందుతాయి. గూగుల్ వర్క్స్పేస్తో ప్రతి యూజర్ తమ సమాచారం అప్డేట్ చేసుకోవచ్చునని సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ట్వీట్ చేశారు.
యూజర్లు తమ ఆలోచనలను చాటింగ్ ద్వారా పంచుకుంటూనే ముఖ్యమైన సమాచారాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ చేయవచ్చునని గూగుల్ తెలిపింది. అదే సమయంలో ఇతరులతో కలిసి పని చేయొచ్చునని ఓ ప్రకటనలో పేర్కొంది.
జీ-మెయిల్ ఇన్బాక్స్ ద్వారా యూజర్లు గూగుల్ ఛాట్ చేయవచ్చు. గూగుల్ డాక్స్లో చెక్లిస్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఇందులోని స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సాయపడుతుంది.
స్మార్ట్ కాన్వాస్ ఫీచర్ సాయంతో యూజర్లు తమ పత్రాలు, వర్క్షీట్లు, స్లైడ్స్ను గూగుల్ మీట్ కాల్లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు పెయిడ్ యూజర్లకే అందుబాటులో ఉండేది.
గతంలో ఈ ఫీచర్ పెయిడ్ యూజర్లకే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం వీటిని గూగుల్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఇంకా యూజర్లకు సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్ఫేస్ అందించేందుకు గూగుల్ రూమ్స్కి స్పేసెస్ అనే కొత్త ఫీచర్ను జోడిస్తున్నట్లు తెలిపింది.