న్యూయార్క్ : సెర్చింజన్ దిగ్గజం ఏడాది కిందట భారీ లేఆఫ్స్కు తెగబడిన క్రమంలో ఈ లేఆఫ్స్ ఉద్యోగుల నైతిక స్ధైర్యంపై ప్రభావం చూపాయని గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ అంగీకరించారు. గతంలో లేఆఫ్స్ను సమర్ధించుకున్న పిచాయ్ తాజా ఉద్యోగుల సమావేశంలో దీని ప్రతికూల ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ భేటీలో 12,000 మంది ఉద్యోగులను తొలగించడం కంపెనీ వృద్ధి, లాభనష్టాలు, ఉద్యోగుల నైతిక స్ధైర్యంపై ఎలాంటి ప్రభావం చూపిందని ఓ ఉద్యోగి ప్రశ్నకు బదులిస్తూ సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉద్యోగులందరికీ వరుసగా లేఆఫ్స్ సమాచారం చేరవేసే పద్ధతి లోపభూయిష్టంగా ఉందని పిచాయ్ అంగీకరించారు.
ఇది సరైన పద్ధతి కాదు..దీన్ని తాము మరో విధంగా చేసి ఉండాల్సిందని స్పష్టం చేశారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులతో తక్షణమే యాక్సెస్ దూరం కావడం కూడా సవాళ్లతో కూడిన నిర్ణయమని, ఇంతటి భారీ స్ధాయి లేఆఫ్స్తో ముడిపడిన సంక్లిష్ట అంశాలకు ఇది సంకేతమని ఆయన చెప్పుకొచ్చారు. 12,000 మంది ఉద్యోగులను తొలగించడం సంక్లిష్ట నిర్ణయమని అన్నారు.
Read More :
Visa Free | భారతీయులకు గుడ్న్యూస్ చెప్పిన ఇరాన్.. ఇకపై వీసా అవసరమే లేదంట!