న్యూఢిల్లీ, నవంబర్ 28: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో నుంచి ప్రసిద్ధ చైనా వాణిజ్య వేత్త జాక్మాకు చెందిన యాంట్ గ్రూప్ పూర్తిగా వైదొలగనుంది. యాంట్ గ్రూప్ కంపెనీ అలీపే 29.6 కోట్ల జొమాటో షేర్లను రూ.3,290 కోట్లకు స్టాక్ ఎక్సేంజీల్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్టు సమాచారం.
షేరుకు రూ. 111.28 ధరతో ఆఫ్లోడ్ చేయడానికి అవసరమైన లావాదేవీల్ని బొఫా సెక్యూరిటీస్; మోర్గాన్ స్టాన్లీ సిద్ధం చేశాయి. ఇటీవలే జపాన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ జొమాటో 1.1 శాతం వాటాను రూ. 1,200 కోట్లకు విక్రయించింది. గత ఏడాదికాలంగా జొమాటో షేరు ధర రూ.62 నుంచి 80 శాతం పెరిగి రూ. 113 వద్దకు చేరింది.