న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో రూ.100, రూ.50 మినహా పెద్దగా హెచ్చుతగ్గుల్లేవు. ఇవాళ కూడా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,272కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,372 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ కాస్త బలపడటమే ఇవాళ దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.134 తగ్గి రూ.62,639కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,773 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో ఇవాళ రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి రూ.73 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,815 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.16 అమెరికన్ డాలర్లు పలికింది.