న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు భారీగా దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా ఐదు శాతం వరకు తగ్గి రూ.2.55 లక్షలకు దిగిరాగా, పదిగ్రాముల బంగారం ధర రూ.1.57 లక్షలకు దిగొచ్చింది.
కిలో వెండి ఏకంగా రూ.13 వేలు లేదా 4.85 శాతం తగ్గి రూ.2,55,000కు తగ్గింది. అంతకుముందు ఇది రూ.2.68 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.3,400 లేదా 2.12 శాతం తగ్గి రూ.1,57,200కు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, పసిడి 4,943 డాలర్ల వద్ద ఉన్నది.