Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.50 పెరిగి రూ.61,650కి చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందుసెషన్ ట్రేడింగ్లో తులం (24 క్యారట్స్) బంగారం ధర రూ.61,600 పలికింది.
ఇజ్రాయెల్-హమస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం ధర ఒడిదొడుకులకు గురవుతున్నది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.74,500 వద్ద స్థిర పడింది. ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం డిసెంబర్ కాంట్రాక్ట్ డెలివరీ ధర రూ.332 తగ్గి రూ.60,267 పలికింది. కిలో వెండి ధర రూ.521 పతనమై రూ.71,554 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గిపోయాయి. ఔన్స్ బంగారం ధర 1975 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.92 డాలర్లు పలికింది. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా ముంబైల్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.240 పెరిగి రూ.61,69లకు, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.56,550 వద్ద నిలిచింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.160 పెరిగి రూ.61,910 పలుకగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం తులం రూ.150 పెరుగుదలతో రూ.56,750 వద్ద స్థిర పడింది.