న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు రూ.56,754 వద్ద స్థిరపడింది. గురువారం ముగింపుతో పోల్చి తే రూ.669 క్షీణించింది. నాడు రూ.57,423 వద్ద ఉన్నది. గ్లోబల్ ట్రెండ్స్ బలహీనంగా ఉండటం వల్లే ధరలు పతనమయ్యాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్లో పుత్తడి ధర 10 గ్రాములు రూ.57,160గా ఉన్నది. రూ.550 తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ రూ.52,400 పలికింది. మరోవైపు వెండి ధర కూడా భారీ ఎత్తున దిగజారింది. ఢిల్లీలో కిలో ధర రూ.1,026 పడిపోయి రూ.66,953 వద్ద ఉన్నది. హైదరాబాద్లో రూ.1,000 క్షీణించి రూ.72,500 పలికింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 1,866 డాలర్లుగా, వెండి రేటు 22.12 డాలర్లుగా ఉన్నది.