న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.555 పెరిగి రూ.45,472కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,917 వద్ద ముగిసింది. ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ అమెరికా డాలర్లో పోల్చితే కాస్త బలహీనపడటమే దేశీయంగా బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ కొంతమేర పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.975 పెరిగి రూ.58,400కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.57,425 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,752 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.16 అమెరికన్ డాలర్లు పలికింది. హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 పెరిగి రూ.47,130కి, 22 క్యారట్ బంగారం ధర రూ.150 పెరిగి రూ.43,200కు చేరింది.