హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.228 పెరిగి రూ.46,812కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,584 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు రాత్రికిరాత్రికే పెరుగడం దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.271 పెరిగి రూ.59,932కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.59,661 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,818 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.70 అమెరికన్ డాలర్లు పలికింది. హైదరాబాద్లోనూ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తులం 24 క్యారట్ బంగారం ధర రూ.120 పెరిగింది. దాంతో రూ.48,760 నుంచి 48,880కి చేరింది.
ఇక తులం 22 క్యారట్ బంగారం ధర కూడా ఇవాళ రూ.100 పెరిగింది. దాంతో మంగళవారం రూ.44,700లుగా ఉన్న ధర ఇవాళ రూ.44,800కు చేరింది. వెండి ధర మాత్రం హైదరాబాద్లో భారీగా తగ్గింది. మంగళవారం రూ.64,600లుగా ఉన్న కిలో వెండి ధర ఇవాళ రూ.3,600 తగ్గి రూ.61,000లకు దిగి వచ్చింది.