న్యూఢిల్లీ, జనవరి 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.46,700గా నమోదైంది. అంతకుముందు ఈ ధర రూ.46,980గా ఉన్నది. పసిడితోపోలిస్తే వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అంతకంతే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.1,300 దిగొచ్చి రూ.59,590కి చేరుకున్నది. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.210 తగ్గి రూ.49 వేలకు దిగిరాగా, 22 క్యారెట్ల ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.44,950 వద్ద నిలిచింది. వెండి రూ.65,400గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,800 డాలర్లకు దిగిరాగా, వెండి 22.34 డాలర్లకు తగ్గినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వెల్లడించింది.