న్యూఢిల్లీ, జూలై 8: బంగారం ధరలు మరింత తగ్గాయి. వరుసగా మూడోరోజూ బుధవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.800 తగ్గి రూ.1,48,450గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,49,250 గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనడం మదుపర్లలో సెంటిమెంట్ను దెబ్బతీశాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు. కానీ, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి రూ.2,39,800 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 49.46 డాలర్లు లేదా 1.2 శాతం తగ్గి 4,056.24 డాలర్లకు పడిపోగా, వెండి 58.61 డాలర్లకు పడిపోయింది. వచ్చేవారంలో జరుగనున్న ఫెడరల్ రిజర్వు సమావేశంలో తీసుకోనున్న నిర్ణయంపై మదుపర్లు వేచిచూసే ధోరణి అవలంబించారన్నారు.