న్యూఢిల్లీ, జూలై 29: బంగారం ధరలు మరింత దిగాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.84,500కి దిగింది. ధర తగ్గకముందు ఇది రూ.89 వేల స్థాయిలో ఉన్నది. ప్రస్తుత సంవత్సరంలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నాటినుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు దిగువముఖంగానే పయనిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 10.60 డాలర్లు పెరిగి 2,438.50 డాలర్లకు చేరు కోగా, వెండి 28.28 డాలర్ల వద్ద ఉన్నది.
న్యూఢిల్లీ, జూలై 29: మదుపరుల కోసం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. సోమవారం ఓ చాట్బోట్ ‘సేవ’ను ప్రారంభించింది. ఈ ఏఐ ఆధారిత సంభాషణ వేదికను బేటా వెర్షన్లో తెచ్చామని సెబీ ఓ ప్రకటనలో తెలియజేసింది. సెక్యూరిటీస్ మార్కెట్, తాజా మాస్టర్ సర్క్యులర్లు, సమస్యల పరిష్కారం మొదలైన సాధారణ సమాచార సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా దీన్ని సిద్ధం చేశారు. ఇదిలావుంటే నవంబర్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్ కోసం ఏఎంసీల్లో మరింత పారదర్శకమైన, ప్రభావవంతమైన ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది.