న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate ) రూ.196 తగ్గి రూ.46,581కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,777 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.146 తగ్గి రూ.59,878కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 60,024 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,767 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.30 అమెరికన్ డాలర్లు పలికింది.