Gold Rates | ధంతేరాస్, దీపావళి పర్వదినాల సందర్భంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతమైనా.. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గురువారం గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర రూ.50,142 పలికింది. క్రితం ముగింపుతో పోలిస్తే 0.11 శాతం లేదా రూ.57 తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్ వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 0.42 శాతం లేదా రూ.235 తగ్గిపోయి రూ.55,779 పలికింది.
బుధవారం డిసెంబర్ ఫ్యూచర్స్ బంగారం తులం ధర రూ.50,199, వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ ధర రూ. 56,014 పలికాయి. బుధవారం ట్రేడింగ్లో పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.50,582గా రికార్డయింది. గతేడాది (2021) దీపావళి సందర్భంగా ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) రూ.50,900 వేలుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.13 శాతం లేదా 2.17 డాలర్లు పెరిగి, 1629.67 డాలర్లకు దూసుకెళ్లింది. వెండి ఔన్స్ ధర 0.03 శాతం తగ్గి 18.41 డాలర్లు పలికింది. దేశీయ బులియన్ మార్కెట్లో ముంబై, కోల్కతా, హైదరాబాద్, కేరళలలో 22 క్యారట్ల తులం బంగారం రూ. 46,550, ఢిల్లీ, జైపూర్, లక్నో నగరాల్లో రూ. 46,700 పలికింది.
24 క్యారట్ల తులం బంగారం ధర రూ.66 తగ్గి రూ.50,516లకు పడిపోయింది. కిలో వెండి ధరలు ముంబై, ఢిల్లీ, కోల్కతా, పుణె, వడోదర, అహ్మదాబాద్, జైపూర్, లక్నోల్లో రూ. 56,400 పలికితే, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, భువనేశ్వర్, మంగళూరుల్లో రూ. 61,500లకు చేరుకున్నది.