న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.850 అధికమై రూ.1.59 లక్షలకు చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి రూ.2.64 లక్షల వద్ద స్థిరంగా ఉన్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
వీటికి తోడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం తో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమయ్యాయన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 30.83 డాలర్లు అందుకొని 5,027. 13 డాలర్లకు చేరుకోగా, వెండి 2.55 శాతం అధికమై 80.5 డాలర్ల వద్దకు చేరుకున్నది.